భారత్ లో 3వ ఒమిక్రాన్ కరోనా కేసు నమోదైంది. 2 రోజుల క్రితం కర్ణాటక రాజధాని బెంగళూరులో 2 ఒమిక్రాన్ కరోనా కేసులు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా గుజరాత్ లో దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ వైరస్ సోకినట్టు అధికారులు తెలిపారు. దీంతో భారత్ లో ఇప్పటి వరకు 3 ఒమిక్రాన్ కరోనా కేసులు నమోదయ్యాయి. చాపకింద నీరులా విస్తరిస్తున్న ఒమిక్రాన్ 38 దేశాలకు పాకింది. అదృష్టం కొద్ది ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఒమిక్రాన్ వల్ల మరణాలు నమోదు కాలేదు. ఒమిక్రాన్ బాధితుల్లో ఎక్కువగా చిన్నపిల్లలు, యువత ఉంటున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా వైరస్ సోకుతుంది.
జాగ్రత్తలివే..
అంతా మాస్కును ధరించాలి, భౌతిక దూరం పాటించాలి.
శానిటైజ్ చేసుకోవాలి. కరచాలనం చేయరాదు.
తుమ్మినా, దగ్గినా చేతిని అడ్డం పెట్టుకోవాలి.
గుంపులు గుంపులుగా ఉండరాదు.
చల్లని పదార్దాలకు దూరంగా ఉండాలి. వేది పదార్దాలు తీసుకోవాలి.
ఏ మాత్రం అనారోగ్యం అనిపించినా వెంటనే వైద్యులని సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
కరోనా పరీక్షలు తప్పనిసరి చేసుకోవాలి.