ఏపీ సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు పది రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తాం అని తెలిపారు. ప్రస్తుతం సీఎం జగన్ తిరుపతిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు సీఎం జగన్ ని కలిశారు. పీఆర్సీపై ప్రకటన చేయాలని సీఎం ను కోరారు. ప్రక్రియ పూర్తయ్యిందని, పది రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తాం అని ఉద్యోగులకు సీఎం జగన్ బదులిచ్చారు.