ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. తొలిరోజు కడప జిల్లాలో పర్యటించిన సీఎం.. రెండో రోజు తిరుపతిలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. శ్రీకృష్ణానగర్ లో వరద తీవ్రత తెలిపే పోటో ప్రదర్శనను తిలకించారు. బాధితులతో నేరుగా మాట్లాడిన సీఎం.. నేనున్నానంటూ భరోసా ఇచ్చారు.
అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తిరుపతి నగరంలోకి వరదనీరు రాకుండా చర్యలు తీసుకుంటామని జగన్ అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నిత్యం బాధితులకు అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరికీ వరదసాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తిరుపతిలో పర్యటించిన అనంతరం తిరుపతి రూరల్ మండలం పాడిపేట వరద బాధితులను జగన్ పరామర్శిస్తారు. సీఎంతో పాటు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఆర్.కే.రోజా, ఇతర అధికారులు పాల్గొన్నారు.