ఈపీఎఫ్, పెన్షన్, ఐటీ రిటర్న్స్, ఎల్పీజీ ఇలా అనేక అంశాలకు సంబంధించి డిసెంబర్ 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1.ఈపీఎఫ్ ఖాతాదారులు తప్పనిసరిగా యూఏఎన్, ఆధార్ నంబర్ ను లింక్ చేయాలి. నవంబర్ 30 లోగా లింక్ చేయకపోతే ఈపీఎఫ్ అకౌంట్ లో యజమాని వాటా జమ కాదు.
2.నవంబర్ 30లోగా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించని పెన్షనర్లకు డిసెంబర్ నుంచి పెన్షన్ రాదు. రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులు అంతరాయం లేకుండా పెన్షన్ పొందాలంటే గడువులోగా బ్యాంకులకు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలి.
3. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్న్ ఫైల్ చేయాల్సిన వారికి వచ్చే నెల 31 వరకే గడువు ఉంది. నెల రోజుల సమయం ఉన్నప్పటికీ, ఫైలింగ్ లో పొరపాట్లు లేకుండా ఉండాలంటే నెల ముందు నుంచే ఈ ప్రక్రియను ప్రారంభించాలని నిపుణులు చెబుతున్నారు. గడువులోగా రిటర్న్స్ ఫైల్ చేయకపోతే ఆలస్య రుసుం వసూలు చేస్తారు.
4. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు డిసెంబర్ 1న గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరించనున్నట్టు సమాచారం. నవంబర్ లో వాణిజ్య సిలిండర్ ధరను రూ.266 పెం చాయి. వంటగ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే, ఈసారి వంటగ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు ఉండొచ్చని చెబుతున్నారు.
5. భారత్ తో పాటు మరో 5 దేశాలపై సౌదీ అరేబియా ఇటీవల ట్రావెల్ బ్యాన్ ఎత్తేసింది. డిసెంబర్ 1 నుంచి ఇది అమలుల్లోకి రానుంది. సౌదీకి వెళ్లే వేలాదిమంది భారతీయ కార్మికులకు ఇది ఊరటనిచ్చే విషయం.