ఓ మహిళ తనకంటే వయసులో చిన్నవాడైన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. డబ్బుల విషయంలో గొడవ జరగడంతో అతడి చేతుల్లోనే ఆమె హత్యకు గురైంది. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన నూటి కోటీశ్వరి అనే మహిళకు తెలంగాణలోని ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన అఖిల్ తో 3 నెలల క్రితం సోషల్ మీడియా యాప్ ద్వారా పరిచయమైంది. కొన్ని రోజుల తర్వాత ఇద్దరి మధ్య శారీరక సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో కోటీశ్వరి తనకు డబ్బులు అవసరముందని అఖిల్ వద్ద ఒకసారి రూ.35 వేలు, మరోసారి రూ.44 వేలు తీసుకుంది. అఖిల్ కుటుంబ సభ్యులు ఆ డబ్బును వ్యవసాయ ఖర్చు నిమిత్తం అప్పుగా తీసుకొచ్చారు. దీంతో ఆ డబ్బు కోసం తల్లిదండ్రులు అతడ్ని నిలదీశారు. తల్లిదండ్రుల ఒత్తిడితో అఖిల్ తన డబ్బు తిరిగివ్వాలని కోటేశ్వరిని అడిగాడు.
ఈ క్రమంలో ఆమె ఈ నెల 19న గుంటూరు వస్తే డబ్బులు తిరిగిస్తానని అఖిల్ కి చెప్పింది. దీంతో అఖిల్ గుంటూరులో కోటేశ్వరి ఇంటికి వెళ్లాడు. తన దగ్గరున్న నగలను తీసుకున్న కోటేశ్వరి మధ్యాహ్నం అఖిల్ తో కలిసి బంగారు షాప్ వద్దకు వెళ్లి వాటిని రిపేర్ చేయమని అడిగింది. అందుకు రూ.50వేలు ఇవ్వాలని అఖిల్ ను అడిగింది. అందుకు నిరాకరించిన అఖిల్ తన దగ్గర తీసుకున్న డబ్బులు ఇవ్వమన్నాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఇంటికి వచ్చేశారు. డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోటేశ్వరిపై ఆగ్రహంతో ఊగిపోయిన అఖిల్ ఆమెను గొంతునలిమి హత్య చేశాడు. ఆమె ఒంటిపై బంగారు నగలు తీసుకొని పాల్వంచ వెళ్లిపోయాడు. ఆ నగలను ఓ ఫైనాన్స్ కంపెనీలో తాకట్టుపెట్టి డబ్బుతీసుకొని ఇంట్లో ఇచ్చేశాడు. కేసును సవాల్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి అఖిల్ తో సంబంధం ఉన్నట్లు నిర్ధారించారు. అతడ్ని అదుపులోకి తీసుకోని విచారించగా అఖిల్ తన నేరాన్ని ఒప్పుకున్నాడు.