ఇండియాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఐటీ ఇండస్ట్రీ భారీ ఎత్తున నియామకాలు చేపట్టడానికి సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో ఇండియన్ ఐటీ సర్వీస్ ఇండస్ట్రీ అక్టోబర్ 2021-మార్చి 2022 మధ్యకాలంలో 4.5 లక్షల ఉద్యోగులను నియమించుకోనుందని మార్కెట్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ అన్ఎర్త్ఇన్సైట్ తాజా నివేదిక వెల్లడించింది. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వేగవంతం చేయాలని సంస్థలు భావిస్తున్న నేపథ్యంలో కొత్తగా ఐటీ రంగంలో చేరే ఉద్యోగుల సంఖ్య పెరిగిపోనుంది. ఫైనాన్షియల్ ఇయర్ 2022 ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలోనే 12 శాతం ఎక్కువగా ఉద్యోగులు ఐటీ రంగంలో చేరనున్నారని అన్ఎర్త్ఇన్సైట్ ఐటీ ఇండస్ట్రీ క్యూ2 ఇన్సైట్స్ & ఎఫ్వై22 ఫోర్కాస్ట్ నివేదిక వెల్లడించింది.