న్యూఢిల్లీ: ఈనెల 23న సమ్మె చేయనున్నట్లు తపాలా శాఖకు చెందిన ఓ ఉద్యోగ సంఘం హెచ్చరించింది. గ్రామీణ్ డాక్ సేవక్ కమిటీ సూచనలను అమలు చేయనందుకు నిరసనగా ది నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయిస్ (ఎన్ఎఫ్పీఈ) బుధవారం సమ్మెకు పిలుపునిచ్చింది. తపాలా శాఖకు చెందిన 4 లక్షల మంది ఉద్యోగులు ఎన్ఎఫ్పీఈకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పోస్టల్ శాఖకు చెందిన మరో కార్మిక సంఘం ఆల్ ఇండియా గ్రామీణ్ డాక్ సేవక్ యూనియన్ వారం క్రితమే నిరవధిక సమ్మెకు దిగింది. తాజాగా ఎన్ఎఫ్పీఈ సభ్యులు కూడా సమ్మె సైరన్ మోగించారు.