ట్రెండింగ్
Epaper    English    தமிழ்

23న తపాలా శాఖలో సమ్మె సైరన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 22, 2017, 09:06 AM

న్యూఢిల్లీ: ఈనెల 23న సమ్మె చేయనున్నట్లు తపాలా శాఖకు చెందిన ఓ ఉద్యోగ సంఘం హెచ్చరించింది. గ్రామీణ్ డాక్ సేవక్ కమిటీ సూచనలను అమలు చేయనందుకు నిరసనగా ది నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయిస్ (ఎన్‌ఎఫ్‌పీఈ) బుధవారం సమ్మెకు పిలుపునిచ్చింది. తపాలా శాఖకు చెందిన 4 లక్షల మంది ఉద్యోగులు ఎన్‌ఎఫ్‌పీఈకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పోస్టల్ శాఖకు చెందిన మరో కార్మిక సంఘం ఆల్ ఇండియా గ్రామీణ్ డాక్ సేవక్ యూనియన్ వారం క్రితమే నిరవధిక సమ్మెకు దిగింది. తాజాగా ఎన్‌ఎఫ్‌పీఈ సభ్యులు కూడా సమ్మె సైరన్ మోగించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com