పట్నా: బిహార్లోని సపుల్ లోక్సభ నియోజకవర్గం ఎంపీ, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రంజీత్ రాజన్ కాన్వాయ్ బీభత్సం సృష్టించింది. సపుల్లోని నిర్మాలి - సికార్హత ప్రధాన రహదారిలో ఆయన కాన్వాయ్లోని వాహనం ఢీకొని ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన సమయంలో నిర్మలి బ్లాక్ కాంగ్రెస్ చీఫ్ రామ్ప్రసేష్ యాదవ్ కూడా అక్కడే ఉన్నారు. అయితే, ఈ ఘటనలో గాయపడిన వారిని ఆయన తన వాహనంలో ఎక్కించుకొని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.