హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాజ్యసభ ఎంపీ, ప్రముఖ సినీనటుడు చిరంజీవి లేఖ రాశారు. తిరుపతి 18వ వార్డులోని స్కావెంజర్స్ కాలనీని ఖాళీ చేయించడాన్ని ప్రశ్నిస్తూ ఆయన లేఖ రాశారు. తిరుపతి నడిబొడ్డున ఆ కాలనీ ఉండటం ఇష్టంలేకే ఖాళీచేయిస్తున్నారని విమర్శించారు. ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకే ప్రభుత్వం ఆ కాలనీ వాసుల్ని ఖాళీచేయిస్తోందని చిరంజీవి తన లేఖలో ఆరోపించారు.