న్యూఢిల్లీ : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 73వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఢిల్లీలోని వీర్ భూమి రాజీవ్ గాంధీ సమాధి వద్ద మాజీ రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్, ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా, ప్రియాంక కుమార్తె మేరియా నివాళులర్పించారు. దేశ వ్యాప్తంగా రాజీవ్ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పలు చోట్ల సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఆగస్టు 20, 1944లో జన్మించిన రాజీవ్ గాంధీ.. మే 21, 1991న కన్నుమూశారు.