విశాఖపట్నం: రాష్ట్రం మీద ప్రభావం చూపిన 3 ఉపరితల ఆవర్తనాలు బలహీనపడినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రాయలసీమ నుంచి దక్షిణ తమిళనాడు వరకు సముద్రమట్టానికి 0.9 కి.మీ ఎత్తు వరకు ద్రోణి ఉందని, దీని ప్రభావంతో బుధవారం కోస్తా వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే ఈనెల 17న ఒడిశా, పశ్చిమబంగాను ఆనుకుని బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే సంకేతాలు వస్తున్నాయని, దీని ప్రభావంతో 18న కోస్తాలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తున్నారు.