ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బస్సు, ట్రక్ ఢీకొని ఏడుగురు దుర్మరణం

national |  Suryaa Desk  | Published : Fri, Oct 01, 2021, 11:34 AM

బస్సులో ప్రయాణికులు గమ్యస్థానానికి చేరుకుంటారనగా ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. మరికొంతమందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ దుర్ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం ఉదయం జరిగింది. ఎంపీలోని భిండ్ జిల్లాలోని గోహడ్ స్క్వేర్ ప్రాంతం వీర్‌ఖాది గ్రామం వద్ద శుక్రవారం ఉదయం వేగంగా వస్తున్న బస్సు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో 13 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు పేర్కొన్నారు. గాయ‌ప‌డ్డ 13 మందిలో మ‌రో న‌లుగురి ప‌రిస్థితి విష‌మంగా ఉందని వారందరికీ గ్వాలియ‌ర్‌లోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భీండ్ ఎస్పీ మ‌నోజ్ సింగ్ వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com