ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భార్య ప్రియుడ్ని ఘోరంగా హత్య చేసిన భర్త

national |  Suryaa Desk  | Published : Wed, Sep 15, 2021, 01:40 PM

ఢిల్లీలోని ద్వారకా జిల్లాలో ఈ నెల 7న చమన్ సెహ్రవత్ అనే 40 ఏళ్ల యువకుడి హత్య జరిగింది. అతడిపై కాల్పులతో పాటు కత్తిపోట్లు ఉండటంతో బాధితుడిపై తీవ్రమైన పగతోనే నిందితులు ఈ రకంగా చంపారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో కేసును ఆ కోణంలో విచారించారు. బాధితుడు ఎక్కడ నివాసం ఉన్నాడనే దగ్గరి నుంచి పోలీసులు విచారణ మొదలుపెట్టారు. అతడికి అదే ప్రాంతంలో ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉందనే ప్రచారం ఉందని పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు ఈ కేసును ఈ కోణంలో దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. 


అతడితో వివాహేతర సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళపై కన్నేశారు. అయితే ఆమె తీరు ఏ రకంగానూ అనుమానాస్పదంగా లేకపోవడంతో మృతుడి హత్యతో ఆమెకు ప్రమేయం ఉండకపోవచ్చని భావించారు. అయితే ఈ హత్య జరిగిన తరువాత ఆమె భర్త రాజీవ్ గుప్తా కనిపించకుండా పోవడంతో అతడికి ఈ హత్యతో సంబంధం ఉండొచ్చనే కోణంలో విచారణ మొదలుపెట్టారు. అతడి కోసం గాలింపు మొదలుపెట్టారు. అతడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో అతడిని విచారించారు. మొదట ఈ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని బుకాయించిన నిందితుడు ఆ తరువాత అసలు విషయం బయటపెట్టాడు. మృతుడు తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతోనే అతడిని హత్య చేసేందుకు కుట్ర చేసినట్టు పోలీసులు తెలిపాడు. అతడిని ఏ రకంగా హత్య చేశామనే విషయాన్ని వివరించాడు. ఈ హత్య చేయడంతో తనకు సహకరించిన మరో ఇద్దరు పేర్లను పోలీసులకు చెప్పాడు. దీంతో ఆ ఇద్దరిని కూడా అరెస్ట్ చేసిన పోలీసులు వారిని కోర్టులో హాజరుపరిచారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com