అఖిలాండ బ్రహ్మాండనాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటీపడుతుంటారు. కరోనా వైరస్ కారణంగా దాదాపు ఏడాదిన్నరగా శ్రీవారి సర్వదర్శనాన్ని టీటీడీ నిలిపివేసింది. ప్రస్తుతం ప్రత్యేక ప్రవేశదర్శన టోకెన్లను మాత్రమే టీటీడీ జారీ చేస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం, ప్రముఖుల సిఫార్సులు, వర్చువల్ సేవా టోకెన్ల ద్వారా రోజుకు 20వేల మంది భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. ఈ రోజు నుంచి సర్వదర్శనం టోకెన్లను జారీ చేయనున్నట్లు తెలిపింది. బుధవారం నుండి అలిపిరి వద్ద 2000 వేల సర్వదర్శనం టిక్కెట్లను జారీని టీటీడీ అధికారులు ప్రారంభించనున్నారు. ఒక కౌంటర్ లో మాత్రమే టిక్కెట్లను జారీ చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. చిత్తూరు జిల్లాకు చెందిన స్థానిక భక్తులకు మాత్రమే సర్వదర్శన టిక్కెట్లను జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.