దేశంలో కరోనా థర్డ్ వేవ్ ఎప్పుడు వస్తుందనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. అయితే మన దగ్గర కరోనా థర్డ్ వేవ్ ప్రభావం సెప్టెంబర్లోనే మొదలవుతుందని, అక్టోబర్లో అది పతాకస్థాయికి చేరుకుంటుందనే వార్తలు కూడా వచ్చాయి. అయితే కరోనా థర్డ్ వేవ్ రావడం, రాకపోవడం అనేక ప్రజల చేతిల్లోనే ఉంది. కరోనా నిబంధనలు పాటిస్తే కరోనా థర్డ్ వేవ్ నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే మహారాష్ట్రలోని ప్రధాన నగరాల్లో ఒకటైన నాగ్పూర్లో కరోనా థర్డ్ వేవ్ మొదలైంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర మంత్రి నితిన్ రౌత్ ప్రకటించారు. నాగ్పూర్లో కరోనా థర్డ్ వేవ్ మొదలైందని, త్వరలోనే ఆంక్షలు విధించే అవకాశం ఉందని ఆయన ప్రకటించారు.