న్యూఢిల్లీ: రక్షాబంధన్ వేడుకలను ఇవాళ దేశమంతా ఘనంగా జరుపుకున్నది.వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్లో ఫ్యాన్స్కు శుభాకాంక్షలు చెప్పారు. మరోవైపు సెహ్వాగ్కు మాత్రం తన ఇద్దరు సోదరీమణులు రాఖీలు కట్టారు. ఈ ఫొటోలను అతను ట్విట్టర్లో షేర్ చేసి తనదైన స్టైల్ కామెంట్ చేశాడు. రక్షాబంధన్ శుభాకాంక్షలు చెబుతూనే.. నా సోదరీమణులు అంజు జీ, గంజు జీ.. నేను హాఫ్ గంజు జీ (అర గుండు) అంటూ వీరూ కామెంట్ చేశాడు.