కృష్ణా: కానూరు విఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థిని అదృశ్యంపై పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసుల కథనం ప్రకారం విజయవాడకు చెందిన యువత కానూరు ఇంజినీరింగ్ కళాశాలలో మూడవ సంవత్సరం ఇంజినీరింగ్ చదువుతున్నది. ఈ నెల 3వ తేదీ పరీక్షలు వ్రాయటానికై కళాశాల వరకు వచ్చి తిరిగి ఇంటికి చేరుకోకుండా అదృశ్యమైంది. తన కూతురు అదృశ్యం అవ్వటానికి అనిల్ అనే వ్యక్తి కారకుడని విద్యార్థినీ తండ్రి ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.