ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొనకమిట్ల మండలం గార్లెదిన్నెలో బొలెరో ట్రక్కు నుంచి జారిపడి నలుగురు మృతిచెందారు. సోమేపల్లి నుంచి అక్కచెరువులో పెళ్లికి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అతివేగం, రోడ్డు గతుకులుగా ఉండటంతో ట్రక్కు డోర్ ఊడిపోయింది. దీంతో దానిపై కూర్చున్న నలుగురు జారిపడి మృతిచెందారు. ప్రమాద సమయంలో వాహనంలో 12 మంది ఉన్నట్లు స్థానికులు తెలిపారు.