ఇండియాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 35,499 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా 39,686 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా.. కరోనాతో 447 మంది బాధితులు చనిపోయారు. ఇప్పటి వరకు 3,11,39,457 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 4,02,188 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా కారణంగా ఇప్పటి వరకు దేశంలో 4,28,309 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 97.40 శాతానికి చేరుకుందని, మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 1.26 శాతం ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.