అమరావతి: సీఎం చంద్రబాబును ఎన్జీవో జేఏసీ నేతలు కలిసారు. అశోక్బాబు ఆధ్వర్యంలో 50 ఉద్యోగసంఘాల నేతలు సీఎంను కలిసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగుల వయోపరిమితి కుదిరించారన్న వార్తలపై సీఎం స్పష్టత ఇచ్చినట్లు తెలిపారు.వయోపరిమితి తగ్గించే ఆలోచనే లేదని వారు వివరించారు. ఉద్యోగుల వయోపరిమితి 60 ఏళ్లకు పెంచిన నేను ఎలా కుదిస్తానన్న సీఎం చెప్పినట్లు సమాచారం. ఉద్యోగులకు డీఏ, పీఆర్సీ బకాయిలను త్వరలో విడుదల చేస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు తెలిపారు.