చెన్నైలో దారుణం చోటుచేసుకుంది. సిగరెట్ అప్పు ఇచ్చేందుకు నిరాకరించిన పాన్షాపు యజమానిని దారుణంగా హత్య చేసిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మదురైలో జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని సక్కిమంగళం సమీపంలోని సమత్తువపురం గ్రామంలో వినోద్ పాన్షాపు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం రాత్రి ఇదే ప్రాంతానికి చెందిన అరుణ్పాండి, కార్తీక్, జ్యోతిమణి దుకాణం వద్దకు వచ్చి సిగరెట్ ఇవ్వాలని కోరారు. కానీ, వినోద్ డబ్బిస్తేనే సిగరెట్ ఇస్తానని, అప్పు ఇచ్చేది లేదని చెప్పాడు. దీంతో ఆగ్రహించిన ముగ్గురు వ్యక్తులు వినోద్పై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వినోద్ను ఆ ప్రాంతవాసులు మదురై రాజాజీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, ఆయన అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నారు.