ప్రతిపక్ష నేత జగన్ చేసిన వ్యాఖ్యలను టిడిపి నేత దేవినేని అవినాష్ తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు పై ప్రతిపక్ష నేత జగన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని దేవినేని అవినాష్ అన్నారు. A1 గా అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవించిన జగన్ పెద్ద 420 అని, జగన్ ది రహదారి కాదు జైలు దారి అని వ్యాఖ్యానించారు. నేరచరిత్ర కలిగిన వ్యక్తులు మీ చుట్టుపక్కల ఉన్నారు. వారందరూ జైలు జివితాన్ని అనుబవించిన వారే,మీరా చంద్రబాబు ను విమర్శించేది అని అవినాష్ అన్నారు. జగన్ ఎన్ని ఆరోపణలు చేసినా టిడిపి జెండానే బెజవాడలో రెపరెపలాడుతోంది.జగన్ ముఖ్యమంత్రి కావాలనే కోరిక తప్ప ప్రజా సమస్యలు మాత్రం పట్టవు. జగన్ కేవలం గెస్ట్ ఆర్టిస్టు మాత్రమే అమరావతి రాజధానికి రావడం వెళ్ళడమే తప్ప ప్రజా సమస్యల గురించి ఆలోచించరు. చంద్రబాబు పై విమర్శలు చేస్తే సహించం రాబోయే ఎన్నికల్లో వైసిపి కి డిపాజిట్లు కూడా దక్కవు అని అయన అన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి గెలుపొందడం ఖాయమని, భూమా నాగిరెడ్డిపై ప్రజలకు నమ్మకం ఉంది అని అయన అన్నారు. ఆ నమ్మకమే నంధ్యాల టిడిపి అబ్యర్ధిని గెలిపిస్తోంది. నంద్యాల లో వైసిపి కి డిపాజిట్లు కూడాదక్కవు. చంద్రబాబును విమర్శించే స్థాయి జగన్ కు లేదు అని టిడిపి నాయకులు కడియాల బుచ్చిబాబు అన్నారు. విజయవాడలో దందాలు,హత్యలు మొదలు పెట్టింది కమ్యూనిష్టులే అన్నారు. క్రిష్ణా జిల్లాలో సాప్ట్ వేర్ కంపినీలు తెచ్చిన ఏకైక వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. జగన్ తలకిందులుగా తపస్సు చేసినా అధికారంలోకి రాలేడు.