శ్రీనగర్: కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు షబీర్ షాను ఈడీ అధికారులు నిన్న రాత్రి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పదేళ్ల క్రితం నాటి మనీలాండరింగ్ కేసులో ఆయనను అరెస్టుచేసిన పోలీసులు ఈ రోజు దిల్లీ న్యాయస్థానంలో హాజరు పరిచారు. విచారించిన న్యాయస్థానం ఆయనను ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉగ్రవాదులకు సాయం చేస్తున్నాడనే ఆరోపణలు షబీర్ షాపై ఉన్నాయి.