ముంబయి: అలనాటి బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్కి, మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ అంటే ప్రాణమట. ఈ విషయాన్ని మాధురి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 1992లో మాధురి బాలీవుడ్ కెరీర్ సక్సెస్ఫుల్గా ఉన్న సమయంలో ఆమె ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. తనకు 25 ఏళ్లు ఉన్నప్పుడు గావస్కర్.. క్రికెట్ ఆడుతున్నప్పుడు చూశానని అప్పటి నుంచి ఆయనకు పెద్ద అభిమాని అయిపోయానని అంటున్నారు. అప్పటినుంచి ఆయన కోసం కలలు కంటుండేదాన్నని ఆయన ఎక్కడికి వెళితే అక్కడి వెళ్లాలనిపించేదని మాధురి పేర్కొన్నారు. మాధురి ఆఖరుగా 2014లో వచ్చిన ‘గులాబ్ గ్యాంగ్’ చిత్రంలో నటించారు. ఆ తర్వాత నుంచి డ్యాన్స్ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.