దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,23,144 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2771 మంది మరణించినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 2,51,857 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,76,36,307కు పెరిగింది. ఇప్పటి వరకు 1,45,56,209 మంది కోలుకోగా.. మొత్తం 1,97,894 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 28,82,204 యాక్టివ్ కేసులున్నాయి.