మహారాష్ట్రలో గురువారం నుంచి శుక్రవారం వరకు కొత్తగా 66,836 కరోనా కేసులు, 773 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 41,61,676కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 63,252కు పెరిగింది. గత 24 గంటల్లో 74,045 మంది కరోనా రోగులు కోలుకున్నారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 34,04,792కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,91,851 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి.