ఇంటర్ నెట్, అపరిమిత కాలింగ్ తదితర విషయాల్లో జియో సృష్టించిన సంచలనం నేపథ్యంలో టెలికాం కంపెనీల మధ్య పోటీ విపరీతంగా పెరిగిపోయింది. టెలికాం కంపెనీలు పోటీలు పడి మరీ వినియోగదారులకు ఆఫర్లు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ మరో సూపర్ ఆఫర్ తో వినియోగదారుల ముందుకు వచ్చింది. కేవలం రూ. 16 కు 2 జీబీ డేటాను అందించే ప్లాన్ ను తీసుకువచ్చింది బీఎస్ఎన్ఎల్. అయితే ఈ ప్లాన్ వ్యాలిడిటీ కేవలం 1 రోజు మాత్రమే. వివిధ కారణాలతో మొబైల్ లో రోజు వారీ డేటా అయిపోతే.. ఈ ప్లాన్ తో రీ చార్జ్ చేసుకుని 2 జీబీ డేటాను పొందొచ్చు.