తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సర్వదర్శనం కోసం రెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి దాదాపు 4 గంటల సమయం పడుతున్నది. కాలినడకన వచ్చేవాళ్లలో అలిపిరి నుంచి వచ్చే వాళ్లు 14,000 మంది, శ్రీవారి మెట్టు నుంచి వచ్చే వాళ్లు 6,000 మంది భక్తులకు మాత్రమే ఇవాళ దివ్యదర్శనం ఉంటుంది. కాలినడకన తిరుమలకు చేరుకున్న భక్తులు టీటీడీ అధికారులు పేర్కొన్న సమయానికే దర్శనం చేసుకోనున్నారు.