గుంటూరు జిల్లా నర్సరావుపేటలో డిగ్రీ విద్యార్థిని అనూషని హత్యచేసిన నిందితుడు హర్షవర్థన్ ను రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ విశాల్ గున్నీ గుంటూరులో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. అనుమానంతోనే ఈ హత్య చేసినట్లు విచారణలో తేలిందని చెప్పారు. 48 గంటల్లో పూర్తి ఆధారాలతో ఛార్జీషీట్ దాఖలు చేశామని, దీంతో పాటూ ప్రత్యేక విచారణ కోసం సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించి, శిక్ష పడేలా చూస్తామని అన్నారు. మహిళలు ఏదైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు 8866268899, 1090 కి సమాచారాన్ని అందించాలని ఆయన సూచించారు. సమస్యల్ని తల్లిదండ్రులు, అన్నదమ్ములతో మాట్లాడుకొని పరిష్కారం దిశగా ఆలోచించాలని చెప్పారు.