కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19పై నిఘా పెట్టేందుకు మార్చి 31 వరకు మార్గదర్శకాలను పొడిగించినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కోవిడ్ -19 మహమ్మారి మధ్య నిఘా, నియంత్రణ మరియు జాగ్రత్తల కోసం ప్రస్తుత మార్గదర్శకాలను విస్తరించాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. భారతదేశంలో 1,55,986 కరోనా వైరస్ కేసులు యాక్టివ్లో ఉన్నాయని కేంద్రం తెలిపింది.