ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 19, 2017, 10:35 AM

ముంబయి: సిగరెట్లపై సెస్సు పెంపుతో మంగళవారం నాటి ట్రేడింగ్‌లో కుదేలైన స్టాక్‌మార్కెట్లు నేడు కాస్త కోలుకున్నాయి. మదుపర్లు పెట్టుబడుల వైపు మొగ్గు చూపడంతో బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 100 పాయింట్లకు పైగా లాభపడి 31,800పైకి చేరగా.. నిఫ్టీ కూడా 9,850 పాయింట్లను దాటింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 128 పాయింట్ల లాభంతో 31,839 వద్ద, నిఫ్టీ 39 పాయింట్లతో 9,865 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 64.33గా కొనసాగుతోంది.


ఇక హెల్త్‌కేర్‌ సంస్థల షేర్లు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. అరబిందో ఫార్మా ఒక్కో షేరు ధర 8శాతం వరకు పెరిగింది. లుపిన్‌, సన్‌ఫార్మా షేర్లు కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com