మహిళల వన్డే ప్రపంచకప్లో భారత్ తన చివరి లీగ్ మ్యాచ్లో భాగంగా న్యూజిలాండ్తో పోరుకు సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య మరికొద్దిసేపట్లో మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇరు జట్లకి ఇదే చివరి లీగ్ మ్యాచ్ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు సెమీస్ చేరుకోనుంది.
టోర్నీని వరుస విజయాలతో ఆరంభించిన మిథాలీ సేన ఆ తర్వాత దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా చేతిలో ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇప్పటికే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు సెమీస్ చేరుకున్నాయి. భారత్ ఖాతాలో ప్రస్తుతం 8 పాయింట్లు ఉండగా.. కివీస్ ఖాతాలో 7 పాయింట్లు ఉన్నాయి. దీంతో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్లో ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు సెమీస్లో ప్రవేశించనుంది.