ఆంధ్రప్రదేశ్ లో సర్వే శిక్షణ సంస్థ ఏర్పాటు కోసం ప్రభుత్వం భూ కేటాయింపులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి అర్బన్ మండలంలోని చెన్నైగుంట గ్రామంలో ఈ శిక్షణ అకాడమీకి భూమిని కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. కమిషనర్ సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డ్స్ విభాగానికి 41 ఎకరాల 82 సెంట్ల భూమిని శిక్షణ సంస్థ కోసం కేటాయించారు.