ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిన్న ఆపరేషన్‌తో షూగర్‌ వ్యాధికి పూర్తిగా చెక్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 21, 2017, 01:01 AM

 -చరి్తక్రెక్కనున్న హైదరాబాద్‌


 -ప్రపంచ ఆరోగ్య ముఖచి్తమ్రే మారుతుంది


 -చరిత్రాత్మకమైన ఈ వైద్య విధానం


హైదరాబాద్‌ : మధుమేహం... ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా విస్తరిస్తున్న మహమ్మారి. మన దేశంలో కూడా ఈ షుగర్‌ వ్యాధి బారిన పడు తున్న వారి సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారిన పడిన వారి కష్టం అంతా ఇంతా కాదు. క్రమం తప్పకుండా మందులు, తీవ్రత ఎక్కువ గా ఉంటే ఇన్సులిన్‌లు వాడాల్సిందే. రోజూ నడక వంటి వ్యాయామాలు తప్ప నిసరి. వీటన్నింటి కన్నా ముఖ్యం... నోటిని కట్టేసుకోవాలి. కంటి ముందు అన్నీ ఉన్నా ఏది పడితే అది తినలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక చిన్న ఆపర ేషన్‌తో ఈ వ్యాధిని సమూలంగా నిర్మూలిస్తే? ఈ ఆలోచనే అద్భుతంగా ఉంది కదూ. ఎస్‌! ఆ రోజు ఎంతో దూరంలో లేదు. అదే నిజమైన రోజున ప్రపంచ ఆరోగ్య ముఖచిత్రమే మారుతుంది. మరో విషయం ఏమిటంటే, చరిత్రాత్మక మైన ఈ వైద్య విధానానికి మన హైదరాబాద్‌ వేదికగా మారబో తోంది. ఎండోస్కోపీ వైద్య విధానంతో మధుమేహాన్ని పూర్తిగా నియంత్రించ వచ్చని మన వైద్యులు గుర్తించారు. ఏడుగురు రోగులపై ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా నిర్వహించగా అది విజయవంతమైంది. ఈ క్రమంలో, ఈ వైద్య విధానాన్ని మరింత మంది రోగులపై ప్రయోగించి ఆ తరువాత వచ్చే ఫలితాలను బట్టి పూర్తి స్థాయిలో ఈ చికిత్సను అందుబాటులోకి తీసుకు వచ్చేం దుకు సన్నా„హా లు జరుగుతున్నాయి. ఈ వైద్య విధానం అందుబాటులోకి వస్తే, మందులు, ఇన్సులిన్‌లు అవసరం లేదని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ డైరెక్టర్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐ సీసీలో మొదటి `వరల్‌‌డ కాంగ్రెస్‌ ఆఫ్‌ జీఐ ఎండోస్కోపీ' సదస్సు జరిగింది. ఈ సందర్భంగా నాగేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ, ఎండోస్కోపీ విధానం ద్వారా మధుమేహానికి చెక్‌ పెట్టే దిశగా విస్తృత పరిశోధనలు చేస్తున్నామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వైద్య విధానం ద్వారా 200 మందికి డయాబెటిస్‌ను అదుపులో పెట్టామని తెలిపారు. హైదరాబాద్‌లో ఏడుగురికి ఈ విధానం ద్వారా మధుమేహాన్ని నియంత్రించామని చెప్పారు. క్లోమంలో ఇన్సులిస్‌ హెచ్చు తగ్గుల వల్లే గ్లూకోజ్‌ నియంత్రణలో ఉండదనే భావన సరి కాదని డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డి తెలిపారు. చిన్న పేగుల్లో కూడా ఇన్సులిన్‌ ఉత్పత్తి అవుతుందని, దానిలో మార్పు లు చేయడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించవచ్చని చెప్పారు. ఎండోస్కోపి ద్వారా చిన్న పేగుల్లోని ఇన్సులిన్‌ను ఎక్కువ లేదా తక్కువ చేయవచ్చని తెలి పారు. చిన్న పేగుల్లో ఉన్న మ్యూకస్‌ను 80 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కాల్చడం ద్వారా, ఇన్సులిన్‌ తగు మోతాదులో ఉత్పత్తి అవుతుందని ఆయన చెప్పారు. ఈ పరిశోధనలు విజయవంతమైతే, ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తున్న మధుమేహం అంతమవుతుంది. ఎన్నో జీవితాల్లో వెలుగులు నిండుతాయి. ఈ పరిశోధనలకు హైదరాబాద్‌ వేదిక కావడం మనందరికీ గర్వకారణం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com