ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అసెంబ్లీలో అసలేం జరిగిందో నాకు తెలియాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 21, 2017, 12:54 AM

 -అసెంబ్లీ కార్యదర్శికి గవర్నర్‌ విద్యాసాగర్‌రావు ఆదేశం


 -తమకీ సీఎం వద్దే వద్దంటూ గవర్నర్‌ విద్యాసాగర్‌కు  తమిళ తంబీల ఇ-మెయిల్‌‌స వెల్లువ


 -పళని ముఖ్యమంత్రిగా వద్దని, ఆయన సర్కారును రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ సందేశాలు


చెనై్న : తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి బల పరీక్ష సందర్భంగా ఈ నెల 18న అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలపై గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు దృష్టి సారించారు. ఆ రోజు అసెంబ్లీలో అసలేం జరిగిందో తనకు నివేదిం చాలని అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్‌ను ఆదేశించారు. వాస్తవాలతో కూడిన నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. బల పరీక్ష సందర్భంగా సభలో విధ్వంసం జరిగిన సంగతి తెలిసిందే. స్పీకర్‌ చొక్కా చింపిన డీఎంకే సభ్యులు సభలోని కుర్చీలు, మైకులను ధ్వంసం చేశారు. దీంతో సభను రెండు సార్లు వాయిదా వేసిన స్పీకర్‌ ఆ తరువాత డీఎంకే సభ్యులను బయటకు పంపాకే  బల పరీక్ష నిర్వహించారు. సభ నుంచి చినిగిన చొక్కాతో బయటకు వచ్చిన డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ సభలో తనపై దాడి జరిగిందని గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. తగిన చర్యలు తీసుకోకుంటే నిరాహార దీక్షకు సైతం దిగుతానని హెచ్చరించారు. అంతే కాదు. ఈనెల 22న తమిళనాడు వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు, నిరాహార దీక్షలు చేపట్టాలని పార్టీ శ్రేణులను అధిష్ఠానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై గవర్నర్‌ నివేదిక కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది.


తమిళనాడు అసెంబ్లీలో ఘర్షణపూరిత పరిణామాలపై గవర్నర్‌కు నివేదిక సమర్పణ రెండు రోజుల క్రితం తమిళనాడు అసెంబ్లీలో జరిగిన అన్ని పరిణామాలపై తనకు సమగ్ర సమాచారం ఇవ్వాలని తమిళనాడు గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు ఆ రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తక్షణమే స్పందించిన జమాలుద్దీన్‌ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై సోమవారం మధ్యాహ్నం గవర్నర్‌కు నివేదిక ఇచ్చారు. ఈ నెల 18న జరిగిన విశ్వాస పరీక్ష సందర్భంగా పలువురు సభ్యులు స్పీకర్‌ ధనపాల్‌ పోడియంను ధ్వంసం చేయడం, సభలోని కుర్చీలు, టేబుళ్లు, మైకులు విరగ్గొట్టడం వంటి చర్యలకు పాల్పడిన విషయం తెలిసిందే.


 పళనిస్వామి తమకు సీఎంగా అక్కరల్లేదంటూ తమిళ తంబీలు గవర్నర్‌ విద్యాసాగర్‌ రావుకు వెల్లువలా ఇ-మెయిల్‌‌స పంపుతున్నారు. అన్నా డీఎంకే పోరుతో తాము అసంతృప్తికి గురయ్యామని, పళని ముఖ్యమంత్రిగా వద్దని, ఆయన సర్కారును రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ సందేశాలను పంపుతున్నారు. మరో వైపు ఆయనను తిరస్కరించాలన్న ప్రచారం సామాజిక మాధ్యమాల్లో సైతం జోరుగా సాగుతోంది. కాగా, ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశించిన శశికళ సుప్రీం కోర్టు తీర్పుతో జైలుకు వెళ్లాల్సిన వేళ, పళనిస్వామిని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. తాము అమ్మ జయలలితను చూసి వోట్లు వేశామని, ఈ పళని తమకు సీఎంగా తగిన వాడు కాదని చెబుతూ, వేలాది మంది గవర్నర్‌కు మెయిల్‌‌స పంపుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com