ఏపీ కస్టమ్స కమిషనర్ ఎస్కే రెహమాన్
విజయవాడ, మేజర్న్యూస్ : కస్టమ్స శాఖలో నూతనంగా ప్రవేశపెట్టిన ఆథరైజ్డ ఎకనమిక్ ఆపరేటర్ (ఏఈఓ) విధానం ద్వారా అంతర్జాతీయ వ్యాపార కార్యకలాపాలు సాగించే ఎగుమతి, దిగుమతిదారులకు పలు ప్రయోజనాలు ఉన్నాయని ఏపీ కస్టమ్స కమిషనర్ ఎస్కే రెహమాన్ తెలియ జేశారు. సోమవారం కస్టమ్స అధీకృత ``ఆర్థిక నిర్వహణ వ్యాపా రుల ప్రయోజనాలు'' అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సులో కమి షనర్ మాట్లాడుతూ ఏఈఓ పథకంలో వ్యాపారులకు మరింత స్వేచ్ఛా, ప్రాముఖ్య తలు లభిస్తాయన్నారు. సరుకు రవాణాలో సంస్థకు విఐపీ ట్రీట్మెంట్, గ్రీన్ చానల్ మార్గం కలుగుతుందన్నారు. ఏఈఓ సర్టిఫికెట్ ఉంటే అంతర్జాతీయ గుర్తింపు లభించినట్లేనని స్పష్టం చేశారు.
తమ వ్యాపార కార్యకలాపాలలో కస్టమ్స అధికారులను వ్యాపారులు కలుసు కోవాలని అవసరం కనీస స్థాయికి పరిమితమయ్యేలా ఈ పథకంలో నాలుగు అంచెల ప్రమాణ గుర్తింపు పత్రం విధానం కల్పించినట్లు తెలి పారు. ఈ పథకం వల్ల దస్తా వేజుల సత్వర పరిష్కారం, అనుమతులు, వ్యయ నియంత్రణ, సమయం ఆదావంటి బహుళ ప్రయోజనాలు పొందే అవకాశం ఉందన్నారు. సంవత్స రానికి 25కు మించి ఎగుమతులు, దిగుమతులు నిర్వహించే చిన్న, మధ్య తరహా సంస్థలు కూడీ ఈ ఏఈఓ ప్రయోజనాలకు అర్హులేనని చెప్పారు.
ఈ సదస్సులో మొహమద్ ఎంటర్ప్రైజెస్ అధినేత ఎంఎల్ఏ షేక్ మహ్మద్ ముస్తఫా, కస్టమ్స అసిస్టెంట్ కమిషనర్ కె. రాజశేఖర్రెడ్డి, సూపరెటెండెంట్లు గుమ్మడి సీతారామయ్య చౌదరి, రమణారావు, ఇన్స్పెక్టర్లు అస్లాం, అశోక్, నవీన్, 60 మంది పారిశ్రామిక వేత్తలు, కస్టమ్స ఏజెంట్లు, లాజిస్టిక్ ప్రొవైడర్లు పాల్గొన్నారు