ఆ ఇద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. పెద్దలు అంగీకరించకపోవడంతో లేచిపోదామని ప్రయత్నించారు. ఇంతలో ప్రియురాలిని కలుసుకోవటానికి ఆమె ఇంటికి వెళ్లిన ప్రియుడు అడ్డంగా దొరికిపోయాడు. దీంతో యువతి కుటుంబ సభ్యులు అతడిని రాత్రంతా బంధించి చితక్కొట్టారు. మరుసటి రోజుల పెళ్లి చేసి అల్లుడిని చేసుకున్నారు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్లోని రామ్పూర్లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొద్దిరోజుల క్రితం అజిమ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుమలి నగర్కు చెందిన ఓ యువకుడు తన ప్రియురాలిని కలిసేందుకు అర్థరాత్రి పూట ఆమె ఇంటికి వెళ్లాడు. ఈ నేపథ్యంలో ప్రియురాలి కుటుంబసభ్యులకు అడ్డంగా దొరికిపోయాడు. అతడిని ఓ రూంలో బంధించి రాత్రంతా చితకబాదారు. తెల్లవారుజామున పోలీసులకు అప్పంగించారు. అయితే పోలీస్ స్టేషన్లో ఈ విషయమై అబ్బాయి, అమ్మాయి తరపు పెద్దలు పంచాయితీ పెట్టారు. ఆ ఇద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా ఆ ఉదయమే వారిద్దరికి పెళ్లి జరిపించారు. రాత్రంతా చితక్కొట్టి తెల్లవారు జామున పెళ్లి చేయడం ఆసక్తికరంగా మారింది.