న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-NPCIL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్టైపెండియరీ ట్రైనీ, సైంటిఫిక్ అసిస్టెంట్, స్టెనో, సబ్ ఆఫీసర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 206 ఖాళీలను ప్రకటించింది. రాజస్తాన్ లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 2020 నవంబర్ 24 సాయంత్రం 4 గంటల్లోగా అప్లై చేయాలి. ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలను న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అధికారిక వెబ్సైట్ https://npcilcareers.co.in/ లో చూడొచ్చు. అభ్యర్థులు నోటిఫికేషన్ చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకున్న తర్వాత ఇదే వెబ్సైట్లో అప్లై చేయాలి.
మొత్తం 206 ఖాళీలు ఉండగా అందులో డిప్లొమా హోల్డర్- 120, సైంటిఫిక్ గ్రాడ్యుయేట్స్- 30, సైంటిఫిక్ అసిస్టెంట్ సీ- 07, సైంటిఫిక్ అసిస్టెంట్ బీ- 19, అసిస్టెంట్ గ్రేడ్ 1 (హెచ్ఆర్)- 01, అసిస్టెంట్ గ్రేడ్ 1 (F&A)- 04, అసిస్టెంట్ గ్రేడ్ 1 (C&MM)- 05, స్టెనో గ్రేడ్ 1- 06, సబ్ ఆఫీసర్ బీ- 01, లీడింగ్ ఫైర్మ్యాన్- 03, డ్రైవర్ కమ్ పంబ్ ఆపరేటర్ కమ్ ఫైర్మ్యాన్- 10 పోస్టులున్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. సంబంధిత బ్రాంచ్లో డిప్లొమా, డిగ్రీ పాసైనవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. పోస్టును బట్టి ఎంపిక విధానం ఉంటుంది.
కొన్ని పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మాత్రమే ఉంది. మరికొన్ని పోస్టులకు రాతపరీక్షతో పాటు స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఎంపికైన వారికి రూ.44,900 వరకు వేతనం లభిస్తుంది. అభ్యర్థులు ముందుగా https://npcilcareers.co.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. అందులో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాలి. పోస్టును సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత పేరు, ఇతర వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి. ఫోటో, సంతకం అప్ లోడ్ చేయాలి. రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.