న్యూఢిల్లీ : అన్ని రాష్ర్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం అయ్యారు. ఈ సమావేశం నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. అన్ని రంగాల్లో సత్వర అభివృద్ధికి సమగ్ర వ్యూహాన్ని అనుసరించడమే లక్ష్యంగా సదస్సు జరుగుతుంది. సదస్సులో సహకార - పోటీతత్వ సమాఖ్య వ్యవస్థపై చర్చించనున్నారు. తెలంగాణ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ పాల్గొన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి, పలు శాఖలకు నిధుల కేటాయింపు అంశాలను ప్రధాని మోదీ దృష్టికి సీఎస్ తీసుకెళ్లనున్నారు.