దేశంలో ఇటీవల కాస్త తగ్గినట్లుగా కనిపించిన కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుంది. దేశంలోని పలు ప్రాంతాల్లో సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో కేసుల సంఖ్య భారీగా పెరిగింది. కేంద్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన తాజా హెల్త్ బులిటెన్ ప్రకారం… గత 24గంటల్లో కొత్తగా 50,356కేసులు నమోదైనట్లు ప్రకటించింది.దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 84,62,080కు చేరుకోగా… మరో 577 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,25,562కు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 5,16,632 యాక్టివ్ కేసులున్నాయి. 78,19,886 మంది రికవరీ అయ్యారు. దేశంలో కరోనా రికవరీ రేటు 92.41 శాతం ఉండగా… మరణాల రేటు 1.48 శాతంగా ఉంది.