ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షార్‌లో కొనసాగుతున్న కౌంట్‌డౌన్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 07, 2020, 09:01 AM

షార్‌లో పీఎస్‌ఎల్‌వీ సీ-49 వాహక నౌక కౌంట్‌డౌన్‌ కొనసాగుతోంది. శ్రీహరికోటలో శుక్రవారం మధ్యాహ్నం 1.02గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. శనివారం మధ్యాహ్నం 3.02గంటలకు సీ-49 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. 51వ మిషన్‌లో భాగంగా పీఎస్‌ఎల్‌వీ భారత్‌కు చెందిన ఈఓఎస్‌-01 సహా విదేశాలకు చెందిన తొమ్మిది విదేశి ఉపగ్రహాలను నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టనుంది. దేశానికి చెందిన భూ పరిశీలన ఉపగ్రహం ద్వారా వాతావరణ, వ్యవసాయ, అటవీ సంబంధ సమాచారం తెలుసుకోవచ్చు. కొవిడ్ -19 మహమ్మారి మధ్య ఇస్రో ఈ ఏడాది చేపడుతున్న మొట్టమొదటి ఉపగ్రహ ప్రయోగం ఇదే. కరోనాతో మార్చి నుంచి అన్ని అంతరిక్ష కార్యకలాపాలు మందగించిన విషయం తెలిసిందే. ఈ మిషన్‌ పూర్తయిన వెంటనే డిసెంబర్ నాటికి కొత్త రాకెట్ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్‌వీ) పరీక్షించేందుకు ఇస్రో సన్నద్ధమవుతోంది. అలాగే జీశాట్‌-12 ఆర్ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని కక్షలో పెట్టేందుకు పీఎస్‌ఎల్‌వీ-సీ 50 మిషన్‌ను చేపట్టాలని ఇస్రో లక్ష్యంగా ముందుకు సాగుతోంది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com