ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 06, 2020, 05:29 PM

ప్రకాష్ నగర్ 61 వ డివిజన్ లో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. తొలుత టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి, వంగవీటి రంగా విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఎన్నికల హామీలను తుంగలో తొక్కిందని విమర్శించారు. నవరత్నాల పేరిట నవమోసాలు చేసారని ఎద్దేవా చేశారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని, పేదలకు ఇళ్ళు ఉచితంగా కట్టిస్తామని అబద్ధపు హామీల తో అధికారంలోకి వచ్చి ఒక్క ఇళ్లు కట్టించేలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వం నిర్మించిన ఇల్లు పూర్తయిన కూడా లబ్ధిదారులకు కేటాయించకపోవడం గర్హనీయం అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం కేటాయించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నా ఇల్లు- నా సొంతం నా స్థలం- నాకు ఇవ్వాలి పేరిట రేపటి నుండి మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలియచేసారు. ప్రజల సమస్యలు పరిష్కారానికి 61 వ డివిజన్ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. అనంతరం డివిజన్ కార్పొరేట్ అభ్యర్థి దాసరి ఉదయశ్రీ మాట్లాడుతూ జగన్ పాలనలో ధరలు ఆకాశాన్ని అంటయాని, ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వం పూర్తి గా విఫలమయ్యిందని వ్యాఖ్యానించారు. ఒక్క చాన్స్ అడిగిన జగన్ కు ఇదే చివరి ఛాన్స్ అని విమర్శించారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com