ప్రాణంగా ప్రేమించిన యువతికి మరో యువకుడితో పెళ్లైపోయింది. ఆమెను మరచిపోలేకపోయాడు. ఆమెను పదేపదే తలచుకుంటూ..ఆమెతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ప్రియుడు మానసికంగా కృంగిపోయాడు. తీవ్ర మనస్థాపానికి గురై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగింది. పట్టణ శివారులోని చంద్రాకాలనీకి చెందిన సలీం కుమారుడు కరీముల్లా(21) ఏసీ మెకానిక్గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ఓ యువతిని కరీముల్లా ప్రేమించాడు. ఆమెకు మూడురోజుల కిందట మరో యువకుడితో వివాహం జరిగింది. ప్రియురాలు ఎడబాటు భరించలేకపోయిన కరీముల్లా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. చేయికోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ విషయం గమనించిన స్థానికులు యువకుడిని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఔట్పోస్టు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.