ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లి చేసుకున్న ప్రియురాలు.. మనస్తాపంతో ప్రియుడు ఆత్మహత్యాయత్నం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 31, 2020, 01:50 PM

ప్రాణంగా ప్రేమించిన యువతికి మరో యువకుడితో పెళ్లైపోయింది. ఆమెను మరచిపోలేకపోయాడు. ఆమెను పదేపదే తలచుకుంటూ..ఆమెతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ప్రియుడు మానసికంగా కృంగిపోయాడు. తీవ్ర మనస్థాపానికి గురై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగింది. పట్టణ శివారులోని చంద్రాకాలనీకి చెందిన సలీం కుమారుడు కరీముల్లా(21) ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ఓ యువతిని కరీముల్లా ప్రేమించాడు. ఆమెకు మూడురోజుల కిందట మరో యువకుడితో వివాహం జరిగింది. ప్రియురాలు ఎడబాటు భరించలేకపోయిన కరీముల్లా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. చేయికోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ విషయం గమనించిన స్థానికులు యువకుడిని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఔట్‌పోస్టు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com