ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్నా : ట్రంప్‌

international |  Suryaa Desk  | Published : Fri, Oct 23, 2020, 09:01 AM

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరింది. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌, డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ మధ్య నాష్‌విల్లేలో తుది సంవాదం నాస్‌విల్లేలో జరిగింది. రెండు నిమిషాల పాటు అంతరాయం లేకుండా మాట్లాడే నిబంధనతో చర్చ కొనసాగింది. ట్రంప్‌, బైడెన్‌ మధ్య కొవిడ్‌ సన్నద్ధత, అమెరికా కుటుంబాలు, పర్యావరణ మార్పులు, జాతీయ భద్రతా, నాయకత్వం సహా ఆరు ప్రశ్నలపై మాట్లాడారు. ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ ట్రంప్‌ మాట్లాడుతూ కరోనా నివారణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. చైనా నుంచి వచ్చిన వైరస్‌ కట్టడి కోసం ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థనే కొన్నాళ్ల పాటు మూసివేశామన్నారు.


ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న సమస్య ప్రపంచమంతా ఉందన్నారు. ఇదో ప్రపంచ సమస్య అని, అయితే మహమ్మారిని ఎదుర్కొవడంలో నా ప్రభుత్వం తీసుకున్న చర్యలను చాలామంది దేశాధినేతలు ప్రశంసించారని గుర్తు చేశారు. తాను కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్నానని, అమెరికాలో కరోనా మరణాల రేటు తగ్గిందని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లోనే కరోనా కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. కొన్ని వారాల్లోనే వాక్సిన్‌ను అందుబాటులోకి వస్తుందని ట్రంప్‌ చెప్పారు. ఆర్మీ సాయంతో వ్యాక్సిన్‌ను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. అమెరికాలో 99శాతం మంది యువత కరోనాను జయించిందని ప్రకటించారు. త్వరలోనే విద్యాసంస్థలు తిరిగి తెరవనున్నట్లు తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com