ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజూ నమోదవుతున్న కోవిడ్ కేసుల కంటే డిశ్చార్జ్ అవుతున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 8,291 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 5,70,667కి చేరినట్టు వైద్యారోగ్యశాఖ బుధవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది. బుధవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 53 లక్షల 2వేల 367 టెస్టులు పూర్తయ్యాయి. గడిచిన 24 గంటల్లో 72,838 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వీరిలో 7,228 మందికి పాజిటివ్గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,46,530 కు చేరింది. గత 24 గంటల్లో 45 మంది మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 5,506కి చేరింది. ప్రస్తుతం 70,357 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ రాష్ట్రంలో 52,29,529 టెస్టులు చేయగా, 6,39,302 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 5,62,376 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
71,465 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కోవిడ్ కారణంగా మరణించినవారి సంఖ్య 5,461కి చేరింది. మిలియన్ జనాభాకు 97,931 టెస్టులు చేస్తూ ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. రికవరీ రేటు 88.27కు చేరింది. ప్రకాశం జిల్లాలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు ప్రకాశం జిల్లాలో రెండు రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.
తాజాగా 218 కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 44,305కి చేరింది. ఒంగోలులో అత్యధికంగా 33 కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి ముగ్గురు మృతి చెందారు.
జిల్లాలో ఇప్పటి వరకు కరోనాతో 435 మంది మృతి చెందారు. నిన్న కరోనా నుండి కోలుకుని 64 మంది డిశ్చార్జ్ అయ్యారు. 32 మందిని హోం ఐసోలేషన్కు పంపారు. జిల్లాలో ఆస్పత్రులతో పాటు హోం ఐసోలేషన్లలో ప్రస్తుతం 10,482 యాక్టివ్ కేసులు ఉన్నాయి.