ఏపీఎస్ఆర్టీసి కీలక నిర్ణయం తీసుకుంది. లాక్డౌన్ అనంతరం మే 21 నుంచి ఆర్టీసీ సర్వీసులను పునరుద్ధరించినా కరోనా నిబంధనల దృష్ట్యా సగం సీట్లకే అనుమతిచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో ఇకపై సీట్ల పూర్తి సామర్థ్యం మేర ప్రయాణికులను అనుమతించాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీసీలో సీట్ల సామర్థ్యం తక్కువగా ఉండటం బస్సులో ప్రయాణించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆన్లైన్లో సగం సీట్లను అందుబాటులో ఉండేలా సాఫ్ట్వేర్లో మార్పులు చేశారు. అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం పూర్తి సామర్థ్యం మేర సీట్లు కేటాయించాలని నిర్ణయించారు. దీంతో ఆన్లైన్లో అన్ని సీట్లు అందుబాటులోకి వచ్చేలా మార్పులు చేయనున్నారు.