ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ ‌లో ఆగని కరోనా విజృంభణ..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 12, 2020, 11:15 AM

భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో అత్యధికంగా రికార్డ్ స్థాయిలో 97,570 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి... 1,201 మంది మృతి చెందారు.. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 46.5 లక్షల మార్క్‌ను కూడా క్రాస్ చేసి 46,59,985కు చేరుకున్నాయి... ఇక, ఇప్పటి వరకు కరోనాబారిన 77,742 మంది మృతిచెందారు. ఇదే సమయంలో.. గడచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 81,533గా ఉన్నట్టు కేంద్రం పేర్కొంది.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టీవ్ కేసుల సంఖ్య 9,58,316గా ఉంది.. ఇప్పటి వరకు కరోనా బారినపడి కోలుకున్నవారి సంఖ్య 36,24,196కు పెరిగింది.. దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 77.77 శాతంగా ఉన్నట్టు పేర్కొంది కేంద్రం.. ఇక, మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 20.56 శాతంగా ఉండగా.. కరోనా మరణాలు శాతం 1.66గా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com