దేశంలో పిస్తోల్ వంటి ఆయుధాలు ఉపయోగించాలంటే తప్పకుండా లైసెన్స్ ఉండాల్సిందే. అయితే.. యూపీ, బీహార్ వంటి రాష్ట్రాల్లో చిన్న పరిశ్రమల తరహాలో వీటిని తయారు చేసి అసాంఘిక శక్తులకు అమ్మేస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్కు చెందిన ఇద్దరు యువకులు దేశీ పిస్తోల్తో ఆటలాడుతూ కనిపించారు. గాల్లోకి కాల్పులు జరుపుతూ వీడియో తీసుకున్నారు. వెంటనే అది సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఈ వీడియో నిమిషాల్లో హపూర్ పోలీసులకు చేరింది. ఈ ఘటన జరిగిన ఆరు గంటల్లోనే పోలీసులు ఆ కుర్రాళ్లను అదుపులోకి తీసుకున్నారు.