నెల్లూరు : జిల్లాలో కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.చిన్న జిల్లా అయినప్పటికీ కేసుల నమోదు, మరణాల సంఖ్యలో పెద్ద జిల్లాలతో పోటీ పడుతోంది ఆస్పత్రుల్లో పేషెంట్లపై పర్యవేక్షణ తగ్గిందని ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది..కొన్ని ఆస్పత్రుల్లో భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు ఎక్కువవుతున్నాయి.రోగుల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోకుండా ఫీజుల వసూళ్లలో ఆస్పత్రుల యాజమాన్యాలు మంచి మనస్సు చేసుకోవాల్సిన అవసరం ఉంది.నిన్న ఒక మహిళ ప్రభుత్వాసుపత్రిలోనే ఆత్మహత్య చేసుకున్న ఘటనను కూడా చూశాం. ఎన్ని ఇబ్బందులు, భయాలున్నా కరోనా రోగుల మధ్య విధులు నిర్వర్తిస్తూ వారికి సేవలందిస్తున్న వైద్య సిబ్బందిని అభినందించక తప్పదు.ఇది ఒక పరీక్షా సమయం..ఇలాంటి పరిస్థితులను అందరూ ఐక్యంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ మంత్రి తెలిపారు