దేశంలో కరోనా తాండవిస్తున్న నేపథ్యంలో జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షలు జరపడం హేయమైన చర్యయని కోడుమూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి, దామోదరం రాధాకృష్ణమూర్తి పేర్కొన్నారు. వచ్చే నెలలో నీట్, జేఈఈ పరీక్షలు నిర్వహించాలని కేంద్రం యోచిస్తోంది. కరోనా నేపథ్యంలో అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకుంటూ పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్రం తెలిపింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ టైమ్లో స్టూడెంట్స్ ఆరోగ్యం గురించి ఆలోచించకుండా ఎగ్జామ్స్ జరపడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రవేశ పరీక్షలు జరపడం అంటే సుమారు 25 లక్షల మంది విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ వారి తల్లితండ్రులను ఆందోళనకు గురి చేయడమే అన్నారు.ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో రవాణా మరియు వసతుల సౌకర్యం సాధ్యం అవుతుందా?. ఒక వైపు కొన్ని రాష్ట్రాల్లో వరదలు, మరోవైపు దేశ వ్యాప్తంగా నెలకొన్న ఆర్ధిక ఇబ్బందులు.. ఇటువంటి పరిస్థితుల్లో ప్రవేశ పరీక్షలు సాధ్యం కాదన్నారు.ప్రస్తుతం పరీక్షలు కాదు, కరోనా టెస్టులు విస్తృతంగా చేయడం ముఖ్యమని అభిప్రాయపడ్డారు. ఈ ప్రస్తుత సమయంలో ప్రవేశ పరీక్షలు ఏ మాత్రం సాధ్యం కాదు, కాబట్టి ప్రవేశ పరీక్షలు తక్షణమే వాయిదా వేయవలసిందిగా జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మరియు కాంగ్రెస్ పార్టీ కోడుమూరు ఇంచార్జ్ అయిన దామోదరం రాధ కృష్ణ మూర్తి ప్రవేశ పరీక్షలు వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.